తెలుగులో ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల “విరాట పర్వం” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ హీరో రానా దగ్గుబాటి, కోలీవుడ్ బ్యూటీ ప్రియమణి, ఫిదా మూవీ ఫేమ్ సాయి పల్లవి తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
అయితే ఇటీవలే ఈ చిత్రంలో సాయి పల్లవి కి సంబందించిన ఓ పోస్టర్ ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.దీంతో ఈ పోస్టర్ ని చూసినటువంటి అభిమానులు ఈ చిత్రంలో సాయి పల్లవి ప్రజల కోసం పోరాటం చేసేటువంటి నక్సలైట్ పాత్రలో నటిస్తున్నట్లు తెగ చర్చించుకుంటున్నారు.
దీంతో తాజాగా ఈ చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల ఈ విషయంపై స్పందించాడు.ఇందులో భాగంగా విరాటపర్వం చిత్రంలో నటి సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో నటించడం లేదని స్పష్టం చేశాడు.
కానీ ఈ చిత్రంలో సాయి పల్లవి కీలక పాత్ర పోషించారని, పోరాట పటిమ కనబరిచేటువంటి సన్నివేశాల్లో సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించిందని చెప్పుకొచ్చాడు.అలాగే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని మరో 20 శాతం వరకు మాత్రమే మిగిలి ఉందని అది కూడా తొందరలోనే పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో తన వరుస సినిమాలతో దూసుకుపోతోంది.ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న “లవ్ స్టోరీ” అనే చిత్రంలో యంగ్ హీరో నాగ చైతన్య సరసన నటిస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది.