టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో సాయి పల్లవి, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం.ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది.
కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ లేకుండా ఉంటే ఈపాటికే థియేటర్ లో మూవీ రిలీజ్ అయ్యేది.అయితే సెకండ్ ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడటంతో రిలీజ్ వాయిదా వేసేశారు.
ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు.అయితే ప్రస్తుతం డిజిటల్ ట్రెండ్ నడుస్తూ ఉండటంతో పాటు చాలా వరకు సినిమాలో ఒటీటీ రిలీజ్ కి సిద్ధం అయిపోతున్నాయి.
డిజిటల్ ఛానల్స్ ఇచ్చే ఆఫర్స్ కి నిర్మాతలు కూడా ఒకే చెప్పేసి సినిమాలని ఒటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు.ఈ నేపధ్యంలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న అన్ని సినిమాలకి ప్రముఖ ఒటీటీ ఛానల్స్ నుంచి విరాటపర్వం సినిమాకి కూడా అలాగే ఆఫర్స్ వచ్చాయి.
అయితే చిత్ర నిర్మాతలు మాత్రమే ఈ సినిమా విషయంలో థియేటర్ రిలీజ్ పైనే ఆసక్తి చూపిస్తున్నారు.తాజాగా ఈ విషయంపై మరోసారి దర్శకుడు వేణు ఊడుగుల క్లారిటీ ఇచ్చాడు.
అలాగే ఈ సినిమా కథపై కూడా కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు.విరాటపర్వం మూవీ అనేది అందరూ అనుకుంటున్నట్లు నక్షల్స్ కి సంబంధించిన కథాంశం కాదని కంప్లీట్ ఎమోషనల్ లవ్ స్టొరీగా దీనిని తెరకెక్కించడం జరిగిందని చెప్పాడు.
ఇందులో నక్షల్స్ పోరాటం అనేది ఒక ఎలిమెంట్ మాత్రమే అని స్పష్టత ఇచ్చాడు.అలాగే అప్పటి సమస్యలని, ఆర్ధిక అసమానతలని సినిమాలో ఎక్కడా చూపించే ప్రయత్నం చేయలేదని చెప్పుకొచ్చాడు.
అలాగే ఈ మూవీ ఎట్టి పరిస్థితిలో థియాట్రికల్ రిలీజ్ మాత్రమే అవుతుందని స్పష్టం చేశాడు.