నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలని లైన్ లో పెట్టి బ్యాక్ టూ బ్యాక్ చేసుకుంటూ వెళ్తున్నాడు.శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ దశలో ఉంది.ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో నాని కెరియర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
ఇక దీని తర్వాత నాని చేయబోయే సినిమా గురించి అప్పుడే టాలీవుడ్ లో చర్చ మొదలైంది.అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శక, నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.30 కోట్ల వరకు బడ్జెట్ పెట్టి నానితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూలో ఉన్నారు.మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఉండటంతో అతని మీద పెట్టుబడి పెట్టిన నష్టాలు అయితే వచ్చే అవకాశం అయితే లేదని నిర్మాతల భావన.
ఇదిలా ఉంటే వకీల్ సాబ్ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వేణుశ్రీరామ్ తన నెక్స్ట్ మూవీని నానితో చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.
స్టార్ హీరోల డేట్స్ కోసం తిరిగితే ప్రస్తుతం వాళ్ళకున్న కమిట్మెంట్ ల కారణంగా మళ్ళీ సంవత్సరాల తరబడి వెయిట్ చేయాలని భావించి మినిమమ్ రేంజ్ హీరో బెటర్ అనే అభిప్రాయంతో నానితోనే సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు.
వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే ఏంసీఏ మూవీ తెరకెక్కి హిట్ అయ్యింది.ఈ నేపధ్యంలో నాని కూడా వేణు శ్రీరామ్ రీసెంట్ గా చెప్పిన కథకి ఒకే చెప్పినట్లు బోగట్టా.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందనని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది.ఇప్పటికే నానితో రష్మిక దేవదాస్ సినిమాలో కలిసి ఆడిపాడింది.
ఆ సినిమా పెద్ద హిట్ కాలేదు.అయితే ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు, హిందీ కలిపి 5 సినిమాల వరకు ఉన్నాయి.
ఇవన్ని పెద్ద ప్రాజెక్ట్ లే కావడం విశేషం.మరి ఇలాంటి సమయంలో నానితో చేయడానికి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది చూడాలి
.