వకీల్ సాబ్ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వేణు శ్రీరామ్.దిల్ రాజు కాంపౌండ్ లో ఉంటూ అప్పుడెప్పుడో పదేళ్ళ క్రితం ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకుడుగా వేణు పరిచయం అయ్యాడు.ఆ సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది.దీని తర్వాత ఆరేళ్ళ గ్యాప్ తీసుకొని నానితో ఏంసీఏ సినిమా చేసి హిట్ కొట్టాడు.అయితే ఈ సినిమాతో అనుకున్న స్థాయిలో ఫేమ్ అయితే ఈ దర్శకుడుకి రాలేదు.మళ్ళీ నెక్స్ట్ సినిమాని అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ అనే ప్రాజెక్ట్ ని దిల్ రాజు బ్యానర్ లోనే ఎనౌన్స్ చేశారు.
అయితే అది లేట్ అవ్వడంతో పింక్ రీమేక్ బాద్యతలని దిల్ రాజు వేణుశ్రీరామ్ కి అప్పగించారు.
ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని ఈ దర్శకుడు అందుకోవడంతో పాటు మేకింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ ని అద్బుతంగా తెరపై ప్రెజెంట్ చేసారనే ప్రశంసలు సొంతం చేసుకున్నాడు.
దీంతో బయట ప్రొడక్షన్స్ నుంచి వేణుకి ఆఫర్స్ వస్తున్నాయి.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ దర్శకుడు తన నెక్ట్నజ ప్రాజెక్ట్ ని మెగా హీరోతోనే ప్లాన్ చేసుకున్నాడు.
సుప్రీం హీరో సాయి తేజ్ కి రీసెంట్ గా వేణు శ్రీరామ్ కథ చెప్పి ఫైనల్ చేయించుకున్నాడని తెలుస్తుంది.ప్రస్తుతం దేవకట్టా దర్శకత్వంలో చేస్తున్న రిపబ్లిక్ కంప్లీట్ అయిన తర్వాత వేణు మూవీని సాయి తేజ్ సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉంది.
అయితే ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తాడా లేక బయట బ్యానర్ లో ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.