తెలుగు స్టార్ కమెడియన్ వేణు మాధవ్ మృతి తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు.కింది స్థాయి నుండి వచ్చిన వ్యక్తి.
స్టార్ కమెడియన్గా, హీరోగా మెప్పించిన నటుడు వేణు మాధవ్.ఈయనకు ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది.
తన వద్దకు సాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా సాయం చేస్తాడని, ఆ క్రమంలో ఆస్తులు పోగొట్టుకున్నాడు అంటూ టాక్ ఉంది.కాని వేణు మాధవ్ ఆస్తులు అయితే పోగొట్టుకోలేదు కాని మంచితనంను మాత్రం జమ చేసుకున్నాడు.
నలుగురిలో మంచోడు అనిపించుకున్నాడు.
శివాజీరాజా ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ సభ్యుడిగా వేణు మాధవ్ చేశాడు.ఇటీవల జరిగిన మా ఎన్నికల ముందు వేణు మాధవ్ మా టీంతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది.ఆ సమావేశంలో శివాజీ రాజా గురించి మాట్లాడుతూ.
ఈయన చాలా దుర్మార్ఘుడు.తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య గురించి చాలా ఆలోచిస్తూ దానికి పరిష్కారం ఎలా చేయాలా అంటూ పదే పదే ఆలోచిస్తూ ఇతరులకు కూడా నిద్ర లేకుండా చేస్తాడు.
శివాజీ రాగా గారు చిన్న చిన్న నటుల నుండి జర్నలిస్టులను కూడా పట్టించుకుంటూ వారి బాగు కోసం పాటు పడే వ్యక్తి శివాజీ రాజా.ఆయన జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.శ్రీకాంత్ గురించి మాట్లాడుతూ ఆయన యొక్క గొప్పతనం మాటల్లో చెప్పలేనన్నాడు.ఇలా అక్కడ ఉన్న ముఖ్యలందరి గురించి ఆ రోజు వేణు మాధవ్ మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
వేణు మాధవ్ చినిపోయిన తర్వాత చివరి మాటలు అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
.