టాలీవుడ్లో కమెడియన్స్గా తమదైన గుర్తింపును సాధించిన పలువురు, హీరోలుగా మారి సక్సె్స్ అందుకున్నారు.అయితే వారిలో చాలా మంది ఎక్కువ కాలం హీరోలుగా నిలదొక్కుకోలేకపోయారు.
దీంతో మళ్లీ కామెడీ చేస్తూ కమెడియన్స్గా మారి ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నించారు.ఈ జాబితాలో చాలా మంది పేర్లు మనం విన్నాం.
కాగా తాజాగా ఓ కమెడియన్ కూడా మెయిన్ లీడ్ పాత్రలో నటించేందుకు రెడీ అయ్యాడు.
వెన్నెల చిత్రంతో టాలీవుడ్లో కమెడియన్గా తనదైన ముద్ర వేసుకున్న వెన్నెల కిషోర్, ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నాడు.
వరుసబెట్టి సినిమాలు చేస్తూ గతకొన్నేళ్లుగా టాలీవుడ్లో బిజీగా మారిన కమెడియన్గా అవతారమెత్తాడు.కాగా తాజాగా వెన్నెల కిషోర్ మెయిన్ లీడ్లో నటిస్తూ ఓ వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అయ్యాడు.
విరాటపర్వం చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు వేణు ఉడుగుల ఓ వెబ్ సిరీస్ను ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ వెబ్ సిరీస్లో వెన్నెల కిషోర్ మెయిల్ లీడ్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ వెబ్ సిరీస్ను వేణు డైరెక్ట్ చేయడం లేదని ఆయనే స్యయంగా తెలిపాడు.ఇక ఈ వెబ్ సిరీస్ను అతి త్వరలో ప్రారంభించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కాగా వెబ్ సిరీస్లకు ప్రస్తుతం ఆదరణ బాగా పెరిగిపోవడంతో, ఈ వెబ్ సిరీస్ను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్కు చెందిన ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ఫాంలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ వెబ్ సిరీస్తో వెన్నెల కిషోర్ అదిరిపోయే సక్సెస్ అందుకుంటాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
కాగా ప్రస్తుతం ఆయన పలు సినిమాల్లో కమెడియన్గా తనదైన పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నాడు.మరి వెబ్ సిరీస్తో వెన్నెల కిషోర్ ఎలాంటి సక్సె్స్ అందుకుంటాడో తెలియాలంటే మాత్రం ఆయన నటించబోయే వెబ్ సిరీస్ స్ట్రీమ్ అయ్యేవరకు ఆగాల్సిందే.