టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ రాంబాబు అనే పాత్రతో 2014లో తెరకెక్కిన దృశ్యం.ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది.ఈ సినిమా శ్రీప్రియ దర్శకత్వంలో రాగా.అంతకుముందే 2013 లో మలయాళంలో ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా దృశ్యం 2 గా మలయాళంలో జీతో జోసెఫ్ దర్శకత్వంలో రాగా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల చేశారు.
ఇక ఈ సినిమా ఇప్పటికీ కూడా మంచి విజయంతో దూసుకెళ్ళగా.
ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలయింది.
తెలుగులో రీమేక్ చేయడానికి జీతు జోసెఫ్ దర్శకత్వం వహించనున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో వెంకటేష్ నటించనుండగా ఇందు కోసం రీమేక్ గురించి నిర్మాత సురేష్ బాబు తో చర్చించారు.
ఈ సినిమా ఓటీటీ లో విడుదల కానుంది కాబట్టి.తెలుగు ప్రేక్షకులు కూడా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుందని ఈ సినిమాను రీమేక్ చేయాలా వద్దా అని వెనుకకు ఆడారు.కానీ చివరకు రీమేక్ నే చేయాలనుకున్నారు.అయితే ఈ సినిమాను తెలుగు వర్షన్ కు తగ్గట్టుగా మార్పులు చేయాలని అనుకోగా, డైరెక్టర్ జీతు జోసెఫ్, వెంకటేష్ తెలిపిన ప్రకారం స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయనున్నారట.
ఇక ఈ సినిమాను మొత్తం 50 రోజుల్లోనే పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది.ఇక ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలని సిద్ధంగా ఉన్నారట.
మలయాళంలో అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందించగా.తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందంటూ సినీ బృందం తెలుపుతున్నారు.