వచ్చే ఏడాది సంక్రాంతికి మంచి పోటీ ఉండే అవాకశం ఉంది.ఇప్పటికే మహేష్బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో సంక్రాంతి బరిలో నిలిచాడు.
అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంను జనవరి 12న విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.ఇక అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ చిత్రం కూడా సంక్రాంతికే వస్తుందని మొదటి నుండి ప్రకటించారు.
అన్నట్లుగా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠపురంలో చిత్రాలు రెండు కూడా ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సంక్రాంతి పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సంక్రాంతి బరిలో ఎంత మంచివాడవురా చిత్రాన్ని కూడా విడుదల చేయబోతున్నట్లుగా కళ్యాణ్ రామ్ మరియు సతీష్ వేగేశ్నలు ప్రకటించారు.ఈ మూడు సినిమాలతో పాటు ఇప్పుడు నెం.4 కూడా సంక్రాంతి బరిలో వచ్చి చేరింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వెంకీమామ చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు.వెంకటేష్ మరియు నాగచైతన్యలు హీరోలుగా నటించిన వెంకీ మామ చిత్రాన్ని మంచి టైం చూసి విడుదల చేయాలని సురేష్బాబు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు.
ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అయితేనే బాగుంటుందని అన్ని విధాలుగా ఆలోచించిన మేకర్స్ సంక్రాంతికి వెంకీ మామను వదలబోతున్నారు.మూడు సినిమాల పోటీని తట్టుకుని వెంకీ మామ నిలుస్తాడా చూడాలి.జనవరి 14న వెంకీ మామ ప్రేక్షకుల ముందుకు రాబోతుందట.
.