భారీ అంచనాల నడుమ రూపొందిన ‘వెంకీమామ’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.వెంకటేష్ మరియు నాగచైతన్యలు ఈ సినిమాలో హీరోలుగా నటించారు.
నిజ జీవితంలో మామ అల్లుడు అయిన వీరిద్దరు సినిమాలో కూడా అదే పాత్రలను పోషిస్తున్నారు, అక్కినేని దగ్గుబాటి మల్టీస్టారర్ అంటూ పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి ప్రచారం జరిగింది.కాని తీరా ఈ సినిమాను చూస్తే ఇదో మల్టీస్టారరా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వెంకటేష్ హీరోగా నటించగా నాగచైతన్య కీలక పాత్రలో గెస్ట్ రోల్ చేసినట్లుగా అనిపించింది.ఇలాంటి పాత్రను చైతూ చేసేందుకు ఒప్పుకోవడంపై అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.అసలు ఇలాంటి సినిమాను మల్టీస్టారర్ అంటూ ఎందుకు ప్రచారం చేశారని ఫ్యాన్స్ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ దర్శకుడు బాబీపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.
విడుదలకు ముందు చైతూకు ఇదో పెద్ద బ్రేక్ మూవీ అంటూ ప్రకటనలు చేయడం ఏంటీ అంటూ విరుచుకు పడుతున్నారు.
సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా వెంకీమామ సినిమా మాత్రమే ఇది, చైతూ అల్లుడు సినిమా కాదు అంటూన్నారు.సినిమాలో చైతూ పాత్ర కొద్దిగే ఉంటుందని మొదటి నుండి ప్రచారం చేసినట్లయితే బాగుండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినిమా మొత్తం వెంకటేష్ నడిపించగా ఇది మల్టీస్టారర్ సినిమా అని ప్రచారం చేయడంతో ప్రేక్షకులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారంటూ జనాలు మండి పడుతున్నారు.
తాజా వార్తలు