అక్కినేని దగ్గుబాటి ఫ్యామిలీ హీరోల సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.ఎట్టకేలకు వెంకీమామతో ఆ ఎదురు చూపులకు బ్రేక్ పడింది.
దగ్గుబాటి హీరో వెంకటేష్ మరియు అక్కినేని హీరో నాగచైతన్యలు కలిసి వెంకీ మామ సినిమాను చేశారు.ఈ సినిమాకు దర్శకత్వంను బాబీ అందించాడు.
ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను తెరకెక్కించానంటూ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం జరిగింది.
ఆ ఇంటర్వ్యూలో బాబీ ఇంకా మాట్లాడుతూ.ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు చిత్ర నిర్మాత మరియు హీరోలకు రుణపడి ఉంటాయి.ఈ సినిమాను చాలా బాగా చేయడంలో ప్రతి ఒక్కరు కృషి చేశారు.ఈ సినిమా కథను మొదట వెంకటేష్ గారికి వినిపించాను.అయితే ఆ సమయంలో అల్లుడి పాత్ర కంటే మామ పాత్ర ఎక్కువగా ఉంటుంది.కథ చెప్పిన తర్వాత బాగుందన్న వెంకటేష్ ఈ కథలో మరో పాత్రను హైలైట్ చేయాలని, ఆ పాత్రకు ఎక్కువగా ప్రాముఖ్యత కల్పించాలంటూ నాగచైతన్య పాత్ర కోసం వెంకీ కండీషన్ పెట్టాడట.
వెంకటేష్ ఆదేశాల అనుసారంగా దర్శకుడు బాబు కథలో మార్పులు చేర్పులు చేసినట్లుగా సమాచారం అందుతోంది.నాగచైతన్య పాత్రను చాలా ఎక్కువగా పెంచేశాడు.సినిమాలో ఇప్పుడు నాగచైతన్య పాత్ర మెయిన్ లీడ్ల కనిపించబోతుందట.నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నాడు.వీరిద్దరి కాంబోలో సీన్స్ సినిమాకు హైలైట్గా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.