విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘వెంకీ మామ’ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.వెంకటేష్ పుట్టినరోజున రిలీజ్ అయిన ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు ఉండటం, చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్తో సందడి చేయడంతో ఈ సినిమాకు బజ్ బాగా క్రియేట్ అయ్యింది.
ఇక నేడు రిలీజ్ అయిన వెంకీ మామ చిత్రం చిత్ర యూనిట్ అనుకున్నదే సాధించింది.
వెంకీ మామ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల 80 శాతం అక్యుపెన్సీని దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
మార్నింగ్, మ్యాటీ షోలలో వెంకీ మామ సినిమా అక్యుపెన్సీ 80 శాతం కంటే ఎక్కువగా ఉందని చిత్ర యూనిట్ తెలిపింది.వెంకటేష్ యాక్షన్, చైతూ ఎమోషన్ కలగలిసి ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చిందని, ఈ సినిమా కలెక్షన్లు కూడా సూపర్గా వస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వెంకటేష్, చైతూల సరసన పాయల్ రాజ్పుత్, రాశిఖన్నాలు హీరోయిన్లుగా నటించిన వెంకీ మామ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది.ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయించాలని సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు ప్రయత్నిస్తున్నారు.
మొత్తానికి వారు చేసిన కృషి ఫలించిందని వారు అనుకుంటున్నారు.