యూత్ స్టార్ నితిన్( Nithiin ) హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా ఇప్పటికే భీష్మ వంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది.డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ కాంబో తెరకెక్కగా సూపర్ హిట్ గా నిలిచింది.
భీష్మ సినిమా తర్వాత ఈ కాంబోపై మంచి అంచనాలు నెలకొన్నాయి.అందుకే ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా రాబోతుంది అని తెలియడంతో ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
”VNRTrio” అంటూ ఇటీవలే ఒక సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.ఛలో, భీష్మ వంటి రెండు హిట్స్ అందుకుని మూడేళ్ళ గ్యాప్ తీసుకుని తెరకెక్కిస్తున్న వెంకీ కుడుముల లేటెస్ట్ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.ఇక అనౌన్స్ మెంట్ వీడియో తోనే రచ్చ రచ్చ చేసిన ఈ కాంబో అంచనాలు బాగా క్రియేట్ చేసుకుంది.
ఆ తర్వాత కొద్దీ గ్యాప్ తోనే మెగాస్టార్ చేతుల మీదుగా గ్రాండ్ లాంచ్ చేసుకున్న ఈ సినిమా షూట్ జరుపుకునేందుకు సిద్ధంగా ఉంది.
ఇదిలా ఉండగా ఈ రోజు మేకర్స్ ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ ను అనౌన్స్ చేసారు.ప్రజెంట్ జివి ప్రకాష్( GV Prakash ) తో ఒక సెన్సేషనల్ ఆల్బమ్ ను అందించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) అనౌన్స్ చేసారు.
జివి ప్రకాష్ సాహిత్య రచయిత కాసర్ల శ్యామ్ కలిసి మ్యూజికల్ సిట్టింగ్స్ లో పాల్గొన్న ఫోటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్నీ తెలిపారు.మరి ఈ మ్యూజికల్ ఆల్బమ్ ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.ఇదిలా ఉండగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక నెలలో చనిపోతాను అని తెలుసుకున్న ఒక వ్యక్తి తన జర్నీని ఎంత హ్యాపీగా మార్చుకున్నాడు? ఎలాంటి సంఘటనలు ఎదుర్కున్నాడు అనే దానిపై వెంకీ ఈ సినిమాను ఫన్నీగా తెరకెక్కించ బోతున్నాడు.