టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నితిన్ ఒకరు.నితిన్ గత సంవత్సరం విడుదలైన భీష్మ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.
ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేసాడు.ఈ సినిమా అటు నితిన్ కెరీర్ కు ఇటు వెంకీ కెరీర్ కు ప్లస్ అయ్యింది.
అయితే ఈ సినిమా తర్వాత వెంకీ కుడుముల ఇంత వరకు మరొక సినిమాను మొదలు పెట్టలేదు.
ఇప్పటికే చాలా మంది హీరోలు పేర్లు వినిపించిన ఒక్కరితో కూడా సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించలేదు.
తాజగా వైష్ణవ్ తేజ్ తో కూడా సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి.కానీ మళ్ళీ ఇప్పుడు వెంకీ కుడుముల నితిన్ తో మరొక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అక్కడితో ఆగకుండా ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేసారని.ఆ కథ నితిన్ కు కూడా బాగా నచ్చిందని.
అంత కుదిరితే త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించ బోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే భీష్మ సినిమాతో సూపర్ కొట్టిన ఈ కాంబో పై మరొకసారి అంచనాలు బాగా పెరిగాయి.
చూడాలి మరి ఈ వార్తలో నిజమెంతో.ఇది ఇలా ఉంటే.
ప్రస్తుతం నితిన్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంటే.తమన్నా కీలక పాత్రలో కనిపిస్తుంది.బాలీవుడ్ లో హిట్ అయిన అంధాదున్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
షూటింగ్ చివరి దశలో ఉండగా ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.ఈ మధ్యనే షూటింగ్ స్టార్ట్ చేసి మిగిలిన కొద్దీ భాగం షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచారు.
త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.