వరుసగా రెండు సినిమాలతో టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు వెంకీ కుడుములు.ఈ యంగ్ టాలెంటెడ్ దర్శకుడు ఈ ఏడాది నితిన్ తో భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇండస్ట్రీలో పెద్ద హీరోల దృష్టిలో పడ్డాడు.
దీంతో తన మూడో సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసే అవకాశాన్ని ఈ యంగ్ దర్శకుడు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.మూడో సినిమా కోసం ముందుగా రామ్ చరణ్ కోసం కథ సిద్ధం చేసుకొని తన స్టైల్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ ని నేరేట్ చేసాడు.
అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత చేసే సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్న రామ్ చరణ్ కి వెంకీ చెప్పిన కథ కనెక్ట్ అయిన పాన్ ఇండియా రేంజ్ కి సెట్ కాదని వదిలేశాడు.దీంతో వెంకీ అదే కథని మహేష్ కి వినిపించి ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో ఇప్పటికే మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పాటు నిర్మాతలు కూడా ఓకే అయిపోవడంతో స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసినట్లు బోగట్టా.ఇక విశేషం ఏంటంటే ఈ సినిమా కోసం కూడా వెంకీ కుడుములు మరల హీరోయిన్ గా రష్మిక మందనని తీసుకోవాలని అనుకుంటున్నాడు.టాలీవుడ్ కి రష్మికని పరిచయం చేసి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ఇచ్చిన రష్మికతో వర్క్ చేయడం కంఫర్ట్ గా భావిస్తున్న వెంకీ భీష్మ కొసం మళ్ళీ ఆమెనే తీసుకున్నాడు.ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ కోసం రష్మికనే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నాడు.
మహేష్ బాబు కూడా ఇప్పటికే రష్మికతో చేసి ఉండటంతో ఆమెతో చేయడానికి అతను కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది.మరి ఈవార్తలపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాలంటే అఫీషియల్ గా ఎనౌన్స్ అయ్యే వరకు వేచి చూడాలి.