టాలీవుడ్లో ఛలో సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల, ఆ తరువాత కాస్త గ్యాప్ తీసుకుని నితిన్కు భీష్మ లాంటి సూపర్ హిట్ మూవీని అందించాడు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ కావడంతో ఈ డైరెక్టర్ తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు.
అయితే వెంకీ కుడుముల తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో తీస్తాడా అనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
ఇప్పటికే ఈ డైరెక్టర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి ఓ భారీ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.వెంకీ కుడుముల తన నెక్ట్స్ మూవీని నేచురల్ స్టార్ నానితో చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే నానిని కలిసిన ఈ డైరెక్టర్ ఓ స్టోరీలైన్ వినిపించాడట.నానికి ఈ స్టోరీలైన్ బాగా నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను అతి త్వరలో సెట్స్పైకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ప్రస్తుతం నాని ‘వి’, టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమాలు పూర్తి కాగానే వెంకీ కుడుములతో సినిమాను పట్టాలెక్కిస్తాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.మరి నాని కోసం ఛలో డైరెక్టర్ ఎలాంటి కథను రెడీ చేశాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
మొత్తానికి చరణ్తో వెంకీ కుడుముల చిత్రం అనే వార్తకు చెక్ పడిందనే అనాలి.