చలో, భీష్మ సినిమాలతో త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుముల దర్శకుడుగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు.కమర్షియల్ కాన్సెప్ట్ కి కామెడీని జోడించి ఈ రెండు సినిమాలతో సక్సెస్ కొట్టడంతో పాటు దర్శకుడుగా కూడా నిర్మాతల దృష్టిలో పడ్డాడు.
ఈ నేపధ్యంలో ఇప్పటికే చాలా ప్రొడక్షన్ కంపెనీలు వెంకీ కుడుములతో సినిమాల కోసం ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది.ఇక ఏ లైన్ లో మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్టైన్మెంట్ ముందు వరుసలో ఉన్నాయి.
వెంకీ తన నెక్స్ట్ సినిమాని ఒక స్టార్ హీరోతో చేయాలని ఫిక్స్ అయ్యి ఇప్పటికే రామ్ చరణ్, చిరంజీవిలకి కథ చెప్పడం జరిగిందని తెలుస్తుంది.అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా కథ చెప్పాడు.
అయితే వీరు ఇప్పటికే వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో ఇప్పట్లో వెంకీతో సినిమా చేసే అవకాశం లేదు.
అయితే వైష్ణవ్ తేజ్ తో తన మూడో సినిమా చేయాలని ప్లాన్ చేసిన అతనికంటే ముందుగా మరో ముగ్గురు దర్శకులు వైష్ణవ్ తేజ్ కోసం క్యూలో ఉన్నారు.
వరుణ్ తేజ్ కూడా ఇప్పట్లో అందుబాటులో లేడు.ఇదిలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ హారికా హాసినీ క్రియేషన్స్ లో లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు.
సితార బ్యానర్ కూడా వారిదే కాబట్టి వెంకీ కుడుములని త్రివిక్రమ్ సినిమా కోసం పని చేయాలని వెంకీని కోరినట్లు సమాచారం.ఇక ఎలాగూ త్రివిక్రమ్ తన గురువే కాబట్టి ఖాళీగా ఉండటం కంటే మరోసారి త్రివిక్రమ్ తో పనిచేసే అనుభవం ఉంటుందని మహేష్ బాబు సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ లో భాగం అయినట్లు తెలుస్తుంది.
ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత అవకాశం సితార వెంకీ సినిమాని స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.