రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత మరల వరుస సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈ నేపధ్యంలో ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ చేయనున్నాడు.
అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ లో సినిమా కన్ఫర్మ్ చేశాడు.వీటితో పాటు తన నెక్స్ట్ సినిమాల విషయంలో పూరి జగన్నాథ్, గోపిచంద్ మలినేని, త్రివిక్రమ్ శ్రీనివాస్, డాలీ, బాబీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు మరో దర్శకుడు పేరు కూడా తెరపైకి వచ్చింది వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమాతో దర్శకుడుగా మారిన వెంకీ అట్లూరీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మలయాళీ సూపర్ హిట్ రీమేక్ అయ్యప్పనుమ్ కోశియుమ్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తుంది.
ఇప్పటికే ఈ రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ మల్టీ స్టారర్ సినిమా కోసం చాలా మంది హీరోలని పరిశీలించారు.
ఇక ఈ సినిమాకి వెంకి అట్లూరిని దర్శకుడుగా కన్ఫర్మ్ చేశారు.ఇక ఈ సినిమా ఫైనల్ గా పవన్ కళ్యాణ్ దగ్గరకి వచ్చి ఆగిందని తెలుస్తుంది.ఇందులో మరో హీరోగా తమిళ యంగ్ స్టార్ విజయ్ సేతుపతి నటిస్తాడని టాక్ వినిపిస్తుంది.ప్రస్తుతం నితిన్, కీర్తి సురేష్ జోడీగా రంగ్ దే టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా పూర్తి కాగానే ఈ రీమేక్ కథ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది.ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి కమిట్ అవ్వడం అనేది ఎంత వరకు కరెక్ట్ అనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ కాని వెంకికి ఛాన్స్ ఇస్తే అతను స్టార్ దర్శకుడుగా మారిపోవడం గ్యారెంటీ అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.