అరణ్య ట్రైలర్‌కు ప్రాణం పోసింది ఎవరో తెలుసా?

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి నటిస్తున్న అరణ్య చిత్రం ఎప్పుడో షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

 Venkatesh Voice Over For Aranya Trailer Impressive, Venkatesh, Rana Daggubati, A-TeluguStop.com

ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టేందుకు రానా రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను అడవి నేపథ్యంలో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందా అనే అంశానికి ఈ సినిమా ట్రైలర్‌తో సమాధానం దొరికిపోయింది.

ఈ సినిమా కథ ఏనుగుల నేపథ్యంలో సాగనుందని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

ఇక ఈ ట్రైలర్‌లో రానాకు ఏనుగులతో ఉండే అనుబంధం గురించి మనకు చెప్పే ప్రయత్నం చేశారు చిత్ర యూనిట్.

కాగా ఈ ట్రైలర్‌ను గమనిస్తే, ఇందులో ఓ స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలుస్తోంది.కానీ చాలా మంది ఈ విషయాన్ని గమనించలేకపోయారు.ఈ ట్రైలర్ ప్రారంభంలో తండ్రిగా వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరో మరెవరో కాదు విక్టరీ వెంకటేష్.రానా దగ్గుబాటి బాబాయ్ అయిన వెంకటేష్‌కు ఈ ట్రైలర్‌లో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందిగా చిత్ర యూనిట్ ఆయన్ను కోరగా, వెంటనే వెంకీ ఓకే అన్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక ఈ సినిమాలో మరో యంగ్ హీరో విష్ణు విశాల్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ఇటీవల మాస్ రాజా రవితేజ నటించిన క్రాక్ చిత్రంలో కూడా వెంకీ వాయిస్ ఓవర్ ఇవ్వగా, అది సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే.

దీంతో ఇప్పుడు వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన అరణ్య చిత్రం కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.మరి అరణ్య చిత్రంతో రానా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube