వెంకటేష్, వరుణ్ తేజ్ లు కలిసి నటించిన ఎఫ్ 2 ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే.ఆ సినిమా వంద కోట్లకు పైగా నే అప్పట్లో వసూళ్లు రాబట్టి సంచలన విజయాన్ని సొంతం చేసుకుని ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది.
ఆ సినిమా హిట్ అయిన వెంటనే సీక్వెల్ గా ఎఫ్ 3 ని తెరకెక్కించబోతున్నట్లుగా వార్తుల వచ్చాయి.ఎఫ్ 3 సినిమా ను రూపొందించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
ఎఫ్ 3 సినిమా కు చాలా పాజిటివ్ టాక్ వచ్చింది.ఎఫ్ 2 కంటే అధికంగా వసూళ్లు నమోదు అవుతాయి అని అంతా భావించారు.
కాని అనూహ్యం గా ఎఫ్ 3 సినిమా కు వసూళ్లు నిరాశ పర్చాయి.కరోనా వల్ల సినిమా కలెక్షన్స్ విషయంలో తీవ్ర ప్రభావం పడిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
థియేటర్ కు వెళ్లి చూడని ప్రేక్షకులు సినిమా ను ఓటీటీ లో ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు.ఓటీటీ లో వచ్చేందుకు సమయం పడుతుందని ముందే యూనిట్ సభ్యులు ప్రకటించారు.
సాదారణంగా అయితే నాలుగు వారాల తర్వాత అంటే ఈ వారం కు రావాల్సి ఉంది.కాని ఈ సినిమా ను థియేటర్లలోనే ఎక్కువగా చూడాలి అంటూ 50 రోజులు పూర్తి అయిన తర్వాత మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు ప్రకటించారు.
సినిమా ఓటీట స్ట్రీమింగ్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తూ ఉండగా ఎట్టలకే ఎఫ్ 3 సినిమా ను జూలై 22వ తారీకున స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా యూనిట్ సభ్యుల నుండి సమాచారం అందుతోంది.ఈ సినిమా ను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.
తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించగా స్పెషల్ సాంగ్ ను పూజా హెగ్డే చేసింది.