పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ లోకి తెరంగేట్రం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్.మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ యంగ్ టాలెంటెడ్ దర్శకుడు నెక్స్ట్ సినిమా చేయడానికి ఏకంగా రెండేళ్ళ గ్యాప్ తీసుకొని ఈ నగరానికి ఏమైంది అనే సినిమా చేశాడు.
ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది తరువాత విజయ్ దేవరకొండ నిర్మాణంలో నటుడుగా తెరంగేట్రం చేసి మీకు మాత్రమే చెప్తా అనే సినిమా చేశాడు.నటుడుగా ఈ సినిమాలో అతనికి మంచి మార్కులే పడ్డాయి.
ఇక మూడో సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ లో వెంకటేష్ హీరోగా చేయడానికి ఎప్పుడో కమిట్ అయ్యాడు.అతనికి కథ కూడా చెప్పడం జరిగింది.
అయితే ఈ సినిమా ఇంకా కార్యరూపం దాల్చలేదు.అయితే సెట్స్ పైకి వెళ్తుంది అనుకునే సమయంలో సడెన్ గా మధ్యలోకి నారప్ప సినిమా వచ్చింది.
నారప్ప తర్వాత స్టార్ట్ చేస్తాడని అనుకుంటే దృశ్యం రీమేక్ పైన వెంకటేష్ దృష్టి పడింది.దీంతో తరుణ్ భాస్కర్ వెయిటింగ్ లో ఉండాల్సి వచ్చింది.
అయితే వీటికంటే సినిమా లేట్ అవడానికి కారణం స్క్రిప్ట్ లో క్లైమాక్స్ అనుకున్న స్థాయిలో రాకపోవడమే అని తరుణ్ భాస్కర్ ఆ మధ్యలో ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.అయితే తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ అయిపోయిందని, క్లైమాక్స్ విషయంలో వెంకటేష్ సంతృప్తి చెందడంతో తరుణ్ భాస్కర్ ఇక షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.
ఇక సురేష్ బాబు కూడా ఒకే చెప్పేయడంతో వేసవిలో మే నుంచి సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు బోగట్టా.ఈ నేపధ్యంలో ఇతర క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో తరుణ్ భాస్కర్ ఉన్నట్లు తెలుస్తుంది.