విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ చిత్రానికి రీమేక్గా వస్తున్న ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ కొట్టాలని నారప్ప టీమ్ చూస్తోంది.ఇక ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాడు.
బ్రహ్మోత్సవం వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తరువాత అడ్డాలకు సినిమా ఛాన్స్ ఏ హీరో కూడా ఇచ్చేందుకు ధైర్యం చేయలేదు.దీంతో విక్టరీ వెంకటేష్ ఆయనకు ఈ సినిమా ద్వారా మరోసారి అవకాశం ఇచ్చాడు.
ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోండగా, కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించడంతో ఈ సినిమా షూటింగ్కు బ్రేకులు పడ్డాయి.పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో నారప్ప చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
కాగా ఈ సినిమా షూటింగ్ను ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే నారప్ప చిత్ర షూటింగ్ను ఇప్పట్లో తిరిగి ప్రారంభించేది లేదని తెలుస్తోంది.
కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండటంతో ఈ వైరస్కు వ్యాక్సిన్ వచ్చిన తరువాతే సినిమా షూటింగ్ను ప్రారంభించాలని వెంకటేష్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.అంటే 2020లో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే సూచనలు లేవని, 2021లో మాత్రమే ఈ సినిమా తిరిగి పట్టాలెక్కవచ్చని చిత్ర వర్గాలు అంటున్నాయి.
మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.