సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్( Venkatesh ) ప్రజెంట్ చేస్తున్న సినిమాల్లో ”సైంధవ్”( Saindhav ) ఒకటి.ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు ఉన్నాయి.
ఎందుకంటే ఈయన హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను( Sailesh Kolanu ) దర్శకత్వంలో ఈ సినిమాను ప్రకటించాడు.వెంకీ కెరీర్ లోనే మైల్ స్టోన్ సినిమా అయిన 75వ సినిమాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ”సైంధవ్”.
వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాను పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తుండడం విశేషం.
నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.
సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.కాగా ఈ సినిమాలో వెంకీకి జోడీగా కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్( Shraddha Srinath ) ఫైనల్ అయ్యింది.
ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది.ఈ సినిమా స్టోరీ గురించి తాజాగా ఒక అంశం వైరల్ అవుతుంది.
శైలేష్ కొలను ఒక సినిమాను తెరకెక్కించాలి అంటే ఎంత రీసెర్చ్ చేస్తారో హిట్ తోనే రుజువు చేసుకున్నాడు.అందుకే ఈ సినిమా స్టోరీపై మరింత ఇంట్రెస్ట్ కలుగుతుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ అని చేతబడి అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు టాక్.అది కూడా రియల్ స్టోరీతో అని తెలుస్తుంది.
మన దేశంలో కర్ణాటక రాష్ట్రంలో బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ అమలులో ఉంది.ఎందుకు అంటే కర్ణాటకలో విపరీతమైన మారణహోమం సంభవించినప్పుడు ఈ యాక్ట్ ను అక్కడి ప్రభుత్వం తీసుకు వచ్చింది.ఇప్పటికి ఈ చట్టం అమలులో ఉందట.
చనిపోయిన వారికీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎలాంటి అధరాలు దొరకపోవడం అప్పట్లో చర్చనీయాంశం కాగా ఎన్నో కేసులు నమోదయ్యాయి.
నేటికీ అక్కడ బ్లాక్ మ్యాజిక్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయట.మరి ఇదే కథతో శైలేష్ సినిమా తీస్తుండగా ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.