ఈమధ్య కాలంలో వెబ్ సిరీస్ ల జోరు కంటిన్యూ అవుతుంది.ఇంగ్లీష్ లో మాత్రమే మొన్నటి వరకు వెబ్ సిరీస్ లను చూసే వారు ఉండేవారు.
ఆ తర్వాత హిందీ కి కూడా వెబ్ సిరీస్ ల జాడ్యం పాకింది.ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా వెబ్ సిరీస్ లకు బ్రహ్మరథం పడుతున్నారు.
కరోనా దయతో ఇండియా లో విపరీతమైన ఓటీటీ మార్కెట్ పెరిగింది.సినిమా ల కంటే కూడా అధికంగా ఓటీటీ కంటెంట్ ను ఇష్టపడుతున్న వారు ఉన్నారు.
మొత్తానికి వెబ్ సిరీస్ లను తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనే విషయంలో క్లారిటీకి వచ్చిన టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అనూహ్యంగా వెబ్ సిరీస్ ల వైపు అడుగులు వేస్తున్నారు.కేవలం ఫిల్మ్ మేకర్స్ మాత్రమే కాకుండా స్టార్స్ కూడా ఓటీటీ లో అడుగులు వేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ త్వరలో ఓటీటీ లో వెబ్ సిరీస్ తో సందడి చేయబోతున్నాడు.తనయుడు రానా తో కలిసి వెబ్ సిరీస్ ను ఇప్పటికే వెంకీ మామ పూర్తి చేశాడు.
వెంకటేష్ మరియు రానా ల వెబ్ సిరీస్ కు రానా నాయుడు అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది.ఇటీవలే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి అయ్యిందంటూ ప్రకటించారు.
కాని స్ట్రీమింగ్ విషయం లో నెట్ ఫ్లిక్స్ వారు క్లారిటీ ఇవ్వడం లేదు.మరో వైపు నాగ చైతన్య ధూత వెబ్ సిరీస్ కు సంబంధించిన స్ట్రీమింగ్ తేదీ దాదాపుగా ఖరారు అయ్యింది.
మరి వెంకీ.రానా ల యొక్క రానా నాయుడు వెబ్ సిరీస్ విషయం లో ఎందుకు ఆలస్యం జరుగుతుంది అంటూ దగ్గుబాటి అభిమానులు చర్చించుకుంటున్నారు.
రానా నాయుడు వెబ్ సిరీస్ తో టాలీవుడ్ లో వెబ్ సిరీస్ ల యొక్క జోరు మరింతగా పెరగడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.