విక్టరీ వెంకటేష్ తన లాండ్ మార్క్ మూవీ 75వ సినిమా త్రివిక్రం తో చేస్తాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తుండగా సడెన్ గా రెండు సినిమాల అనుభవం ఉన్న డైరెక్టర్ శైలేష్ తో ఫిక్స్ చేసుకున్నారు.సైంధవ్ అంటూ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తూ ఫస్ట్ లుక్ టీజర్ తోనే సినిమా లెక్క ఏంటో చూపించారు.
ఈ సినిమాతో వెంకటేష్ పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు.ప్రస్తుతం వెంకటేష్ బాలీవుడ్ లో కిసి కా భాయ్ కిసి కి జాన్ అనే సినిమా చేస్తున్నాడు.
రీసెంట్ గా మూవీ టీజర్ మెప్పించింది.
ఇక ఎలాగు సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేస్తున్నాం కాబట్టి ఈ సైంధవ్ సినిమాను కూడా నేషనల్ వైడ్ రిలీజ్ చేస్తే రీచబులిటీ ఎక్కువ ఉంటుందని వెంకటేష్ అలా ప్లాన్ చేశారు.అదీగాక సినిమా యాక్షన్ ప్రాజెక్ట్ కాబట్టి హిందీ ఆడియన్స్ ను కూడా అలరించే ఛాన్స్ ఉంటుందని అలా డిసైడ్ అయ్యారట.సైంధవ్ తెలుగు సినిమాగానే తెరకెక్కుతుంది కానీ సౌత్ అన్ని భాషలతో పాటుగా హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ అవుతుంది.
ఈ సినిమాతో వెంకటేష్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటాలని చూస్తున్నారు.