విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర చాలా రఫ్గా ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూస్తే తెలుస్తోంది.
తమిళంలో స్టార్ హీరో ధనుష్ నటించిన ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా రానుంది.
ఇక ఈ సినిమాలో నటిస్తున్న వెంకటేష్ తన రెమ్యునరేషన్ పెంచేశాడని, ప్రస్తుతం ఆయనకున్న క్రేజ్కు ఇలా చేశాడని టాలీవుడ్లో పుకార్లు వినిపిస్తున్నాయి.
అయితే ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదని తెలుస్తోంది.వెంకటేష్ ఈ సినిమా కోసం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట.లాభాల్లో వచ్చే షేర్ను ఆయన తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
అయితే గతంలో ఎప్పుడు వెంకటేష్ ఇలా చేయలేదని, ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న ఆయన ఇలా షేర్ తీసుకోవడం నిజంగా విశేషమని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.ఇక నారప్ప చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.