తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన అసురన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను విక్టరీ వెంకటేష్ను హీరోగా పెట్టి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనేది చాలా ఆసక్తికరంగా మారింది.కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా ఈ సినిమా తరువాత వెంకటేష్ తన నెక్ట్స్ మూవీని లైన్లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ క్రమంలోనే టాలీవుడ్లో ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఓ అదిరిపోయే కథను రెడీ చేస్తున్నాడు.ఈ కథను విక్టరీ వెంకటేష్కు వినిపించాలని చూస్తున్నాడట.
కాగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాడు.ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది.
కాగా ఈ సినిమా తరువాత వెంకటేష్తో కలిసి సినిమా చేసేందుకు కమ్ముల రెడీ అవుతున్నాడు.అయితే వెంకటేష్ మాత్రం నారప్ప చిత్రం పూర్తయ్యాకే తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.