వెంకటేష్ నటించిన నారప్ప సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.వచ్చే వారంలో అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నారప్ప సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
నారప్ప సినిమా ను థియేటర్ల ద్వారా నే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నప్పటి కి కరోనా కారణంగా థియేటర్లు ఇప్పట్లో తెరుచుకున్నా వెంటనే జనాలు వస్తారో లేదో అనే అనుమానంతో సినిమా ను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.ఈ విషయంలో అభిమానులు నిరుత్సాహంగా ఉన్న విషయం మాకు తెలుసు.
కాని ఈసారికి క్షమించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశాడు.దృశ్యం మరియు నారప్ప సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.
కాని ముందు ముందు సినిమాలన్నీ కూడా థియేటర్ల ద్వారానే విడుదల చేస్తామని హామీ ఇచ్చాడు.
నిర్మాతల పరిస్థితి ఇతర విషయాలను అర్థం చేసుకుని ఓటీటీ రిలీజ్ కు వెళ్లేందుకు ఒప్పుకున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.
మీడియాలో అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు చాలా మంది నారప్ప సినిమా ను ఓటీటీ ద్వారా విడుదల చేయడం ను ఖండిస్తున్న నేపథ్యంలో వెంకటేష్ పై విధంగా స్పందించాడు.
మీడియాలో నారప్ప సినిమా గురించి పాజిటివ్ గా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రికార్డు బ్రేకింగ్ లో ఈ సినిమాను అత్యధికులు చూస్తారని ఆశిస్తున్నాం అంటూ వెంకటేష్ చెప్పుకొచ్చాడు.తమిళంలో ధనుష్ చేసిన అసురన్ సినిమా కు నారప్ప రీమేక్ అనే విషయం తెల్సిందే.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన నారప్ప సినిమా లో ప్రియమణి కీలక పాత్రలో కనిపించబోతుంది.నారప్ప గా వెంకీ మామ లుక్ చాలా విభిన్నంగా ఉంది.ఇప్పటి వరకు చేసిన సినిమాల్లోకి ఈ సినిమా కోసం ఎక్కువ కష్టపడ్డట్లుగా ఆయన చెబుతున్నాడు.