మొదటి సినిమా పిట్టగోడ ఎవరికి తెలియకపోయినా జాతిరత్నాలు సినిమాతో డైరక్టర్ గా తన సత్తా చాటాడు అనుదీప్ కెవి.నాగ్ అశ్విన్ నిర్మాతగా జాతిరత్నాలు సినిమాతో హిట్ అందుకున్న అనుదీప్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు.
తన నెక్స్ట్ సినిమా పై రకరకాల వార్తలు రాగా ఫైనల్ గా అనుదీప్ విక్టరీ వెంకటేష్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.జాతిరత్నాలు 2, తమిళ హీరో శివ కార్తికేయన్ తో సినిమా చేస్తున్నాడన్న వార్తలు రాగా.
వెంకటేష్ కోసం అనుదీప్ ఒక కథ రాసుకున్నాడట.దాదాపు ఈ సినిమా కన్ఫర్మ్ అవుతుందని అంటున్నారు.
వెంకటేష్ మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథ ఉంటుందని చెబుతున్నారు.వెంకటేష్ ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు.ఆ సినిమాతో పాటుగా దృశ్యం 2 రిలీజ్ కు రెడీ అవుతుంది.మరి అనుదీప్ తో వెంకటేష్ సినిమా ఉంటుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.
తప్పకుండా ఈ కాంబో నుండి క్రేజీ సినిమా వస్తుందని చెప్పొచ్చు.వెంకటేష్ ను మెప్పించాడు అంటే డైరక్టర్ అనుదీప్ ఖాతాలో మరో హిట్ పడినట్టే లెక్క.
జాతిరత్నాలు పార్ట్ 2 కూడా లైన్ లో పెడుతున్నాడు అనుదీప్.ఆ సినిమా అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎక్సయిటింగ్ గా ఉన్నారు.