వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన దృశ్యం సినిమా ఏ స్థాయిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే.ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయనే సంగతి తెలిసిందే.
దృశ్యం సినిమాకు సీక్వెల్ గా దృశ్యం2 సినిమా తెరకెక్కగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.మలయాళ దృశ్యం, దృశ్యం2 సినిమాలలో మోహన్ లాల్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
మలయాళ దృశ్యం2 సినిమా కూడా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే.అయితే అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన దృశ్యం2 సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది.గత కొన్ని నెలలుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే.అయితే దృశ్యం2 సినిమా కళ్లు చెదిరే స్థాయిలో సక్సెస్ సాధిస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తుండటం గమనార్హం.
అయితే హిందీ దృశ్యం2 భారీగా కలెక్షన్లు సాధిస్తుండటంతో వెంకటేష్, మోహన్ లాల్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
మలయాళ దృశ్యం2, తెలుగు దృశ్యం2 సినిమాలు కూడా థియేటర్లలో విడుదలై ఉంటే ఈ సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించి ఉండేవని వెంకటేష్, మోహన్ లాల్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.వెంకటేష్, మోహన్ లాల్ తమ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని ఈ రెండు సినిమాలకు కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చేవని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.ఈ విషయంలో వెంకటేష్, మోహన్ లాల్ అభిమానులు ఎంతగానో ఫీలవుతున్నారు మరోవైపు దృశ్యం3 సినిమా దిశగా అడుగులు పడుతుండగా వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.దృశ్యం3 సినిమా కూడా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఈ సినిమా అభిమానులు భావిస్తున్నారు.వెంకటేష్, మోహన్ లాల్ తమ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయకపోవడం వల్ల 60 నుంచి 70 కోట్ల రూపాయల నష్టం అని తెలుస్తోంది.