‘గోపాల గోపాల’ చిత్రం తర్వాత దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకున్న వెంకటేష్ తన తర్వాత సినిమాను ఇటీవలే ప్రారంభించిన విషయం తెల్సిందే.వెంకీ పలు కథలు మరియు పలువురు దర్శకులను పరిశీలించిన తర్వాత తన కోసం మారుతి తయారు చేసుకు వచ్చిన కథకు ఓకే చెప్పాడు.
‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ను అందుకున్న మారుతికి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని అంటేలా వస్తున్నాయి.మారుతి తనదైన మార్క్ బ్రాండ్తో ఈ చిత్రాన్ని ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కిస్తున్నాడు.
వెంకీ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు మారుతి గుడ్ న్యూస్ చెప్పాడు.
వెంకీ, మారుతిల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘బాబు బంగారం’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు.
తాజాగా ఈ చిత్రాన్ని వేసవి మధ్యలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం అంటూ మారుతి అధికారికంగా ప్రకటించాడు.నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి అయ్యింది.
త్వరలోనే రెండవ షెడ్యూల్ను ప్రారంభించి చిత్రాన్ని ఏప్రిల్లో పూర్తి చేసి మేకు ‘బాబు బంగారం’ను విడుదల చేస్తారేమో చూడాలి.‘భలే భలే మగాడివోయ్’ ఎఫెక్ట్తో ఇప్పటికే ఈ సినిమా అన్ని ఏరియాల్లో కూడా రికార్డు స్థాయి బిజినెస్కు సిద్దంగా ఉంది.