టాలీవుడ్ సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వెంకటేష్ నటించిన సినిమాలన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ఈ క్రమంలోనే ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న వెంకటేష్ ఇప్పటికే వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే వెంకటేష్ నటించినటువంటి ఎఫ్2, వెంకీ మామ, నారప్ప వంటి చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
తాజాగా వెంకటేష్ నటించిన చిత్రం థియేటర్లో కాకుండాఓటీటీలో విడుదలయి మంచి టాక్ సంపాదించింది.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో అసురన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కినది.
ఈ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు దారుణంగా ఉండడంచేత నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.ఇదిలా ఉండగా వెంకటేష్ తదుపరి చిత్రం దృశ్యం 2 రీమేక్ చిత్రం లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి హాట్ స్టార్ కొనుగోలు చేయాలని భావించింది.అయితే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలు ఒప్పుకోలేదు.ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ సినిమాను డైరెక్ట్ గా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే దృశ్యం 2 సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13వ తేదీ థియేటర్లలో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే దసరా పండుగ కావడంతో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అఖండ, కొండ పొలం వంటి సినిమాలు కూడా దసరా రేస్ లో ఉండగా దృశ్యం 2 సినిమా కూడా పండుగ రేసులో మిగతా సినిమాలతో పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనప్పటికీ వెంకటేష్ ఈ రీమేక్ చిత్రాన్ని డైరెక్ట్ గా థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు.