కేరాఫ్ కంచరపాలెం సినిమాతో టాలీవుడ్ లో అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకున్న దర్శకుడు వెంకటేష్ మహా.మొదటి సినిమాతోనే రానా లాంటి స్టార్ ని మెప్పించి సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ ద్వారా అందరికి పరిచయం అయ్యాడు.
చిన్న బడ్జెట్ తో తెరకెక్కించిన ఆ సినిమాకి సెలబ్రెటీలు అందరూ ప్రమోట్ చేయడం ద్వారా మంచి హిట్ టాక్ రావడంతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి.అయితే ఆ సినిమా కేవలం సెలబ్రెటీల ప్రమోషన్ వలన హిట్ అయ్యింది తప్ప అందులో విషయం ఏమీ లేదని కొంత మంది విమర్శలు చేశారు.
అయితే వెంకటేష్ మహా తన రెండో సినిమాని మలయాళీ రీమేక్ గా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాని సత్యదేవ్ తో తెరకెక్కించాడు.ఈ సినిమా తర్వాత దర్శకుడుగా మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు.
ఇక సత్యదేవ్ కి కూడా ఈ సినిమా మంచి ఇమేజ్ తీసుకొచ్చింది.ఇక ఇప్పుడు వెంకటేష్ తన మూడో సినిమాకి రెడీ అవుతున్నాడు.
రాయలసీమ బ్యాక్ డ్రాప్లో జరిగే పీరియాడికల్ కథాంశంతో కొత్త సినిమా స్టోరీ సిద్ధం చేశాడు.ఈ స్క్రిప్ట్కి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని తెలుస్తుంది.సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో రానా ఈ సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని టాక్.
త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.వెంకటేష్ మహా తొలి చిత్రం కేరాఫ్ కంచరపాలెంను సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రానా సమర్పించిన సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో వెంకటేష్ మహా టాలెంట్ గుర్తించిన సురేష్ ప్రొడక్షన్ మూడో సినిమాని తమ బ్యానర్ లోనే తెరకెక్కిస్తోంది.ఇక ఈ సినిమా కోసం కొద్దిగా ఫేమ్ ఉన్న నటులని తీసుకుంటున్నట్లు సమాచారం.
.