లాక్ డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనల మేరకు గత కొద్ది కాలం నుండి తిరిగి మళ్ళీ సినిమా రంగానికి చెందిన షూటింగులు మొదలయ్యాయి.అయితే ఇప్పటి వరకు ఎలాంటి బడా హీరోల సినిమాలు మాత్రం తిరిగి మొదలవలేదు.
గత ఆరు నెలల నుండి షూటింగ్ లేక పూర్తిగా ఖాళీగా ఉన్న హీరోలు ఇప్పుడిప్పుడే కెమెరాల ముందు కెమెరా యాక్షన్ అంటూ రంగంలోకి దూకుతున్నారు.ఈ మధ్యకాలంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా, అలాగే బ్రహ్మాస్త్ర అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
అలాగే బోయపాటి శ్రీను, బాలకృష్ణ మూడో సారి కలిసి చేస్తున్న సినిమా కూడా రీసెంట్ గా షూటింగ్ మొదలైంది.నవంబర్ 15 నుంచి బాలయ్య బాబు ఈ షూటింగ్ లో అడుగుపెట్టబోతున్నాడు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా నవంబర్ 9 నుండి మొదలు కానున్న సినిమా షూటింగ్ లో అడుగుపెట్టబోతున్నాడు.దీనితో పాటుగా తాజాగా టాలీవుడ్ మరో సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ కూడా తాను నటిస్తున్న నారప్ప సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.
తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయానికి సంబంధించి తెలపడం జరిగింది.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 80 శాతం పైగా షూటింగ్ పూర్తయింది.
మిగిలిన 20 శాతం సినిమా షూటింగ్ కోసం గురువారం నుండి ఈ సినిమా షూటింగ్ కేవలం నెల రోజుల్లో పూర్తి కానుంది.ఈ సినిమాను తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు రీమేక్ గా తెలుగులో నారప్పగా తెరకెక్కుతోంది.
ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈయన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మరోసారి హీరో వెంకటేష్ తో సినిమాను చేస్తున్నాడు.
ఇకపోతే నారప్ప సినిమా సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు వి క్రియేషన్స్ బ్యానర్ లో కలైపులి ఎస్.థాను నిర్మాణ బాధ్యతలను చేపడుతున్నారు.అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి 2021 సంక్రాంతికి లేదా వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.