దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్ 2’ చిత్రం గతేడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఎగబడ్డారు.
ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించడంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఫుల్టూ ఎంజాయ్ చేశారు.కాగా ఈ సినిమాతో స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన దర్శకుడు అనిల్ రావిపూడి, తన నెక్ట్స్ మూవీని ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేశాడు.
అయితే ఎఫ్2 చిత్రానికి సీక్వెల్ను ప్లాన్ చేస్తున్నట్లు అనిల్ రావిపూడి గతంలోనే వెల్లడించాడు.ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రం సక్సెస్ అందుకోవడంతో, ఇప్పుడు ఎఫ్ 3 సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ క్రమంలోనే ఈ సినిమా కథను పూర్తి చేసిన అనిల్ రావిపూడి, హీరోల కోసం ఎదురుచూస్తున్నాడు.అయితే ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్లు వాయిదా పడటంతో వెంకటేష్ నటిస్తున్న నారప్ప, వరుణ్ తేజ్ నటిస్తున్న బాక్సర్ చిత్రాలు ఇంకా పూర్తి కాలేదు.
ఒక్కసారి తన నారప్ప చిత్రం పూర్తికాగానే ఎఫ్ 3లో అల్లరి చేసేందుకు రెడీ అంటున్నాడు వెంకీ మామ.లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయిందని, ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, అనిల్ రావిపూడితో మరోసారి చేతులు కలిపేందుకు రెడీ అంటున్నాడు వెంకీ.అయితే ఈ సినిమా జనవరిలో పట్టాలెక్కే సూచనలు ఉన్నట్లు వెంకీ క్లూ ఇవ్వడంతో వరుణ్ తేజ్ బాక్సర్ చిత్రం సంగతేమిటని సినీ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.ఏదేమైనా ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియాలంటే మాత్రం మరికొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.