వెంకటేష్.మీనా ప్రథాన పాత్రల్లో వచ్చిన దృశ్యం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అది మలయాళ దృశ్యంకు రీమేక్ అనే విషయం తెల్సిందే.మోహన్ లాల్ మరియు జీతూ జోసెఫ్ ల మలయాళం దృశ్యంకు గత ఏడాది సీక్వెల్ వచ్చింది.దృశ్యం 2 అంటూ వచ్చిన సీక్వెల్ ఓటీటీ ద్వారా విడుదల అయినా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.రికార్డు స్థాయిలో అమెజాన్ లో వ్యూవర్ షిప్ ను దక్కించుకుందనే వార్తలు వస్తున్నాయి.
దృశ్యం 2 సినిమాను తెలుగు లో రీమేక్ చేశారు.కేవలం 45 రోజుల్లోనే సినిమాను ముగించేశారు.
కాని కరోనా వల్ల సినిమా విడుదల జాప్యం అయ్యింది.థియేట్రికల్ రిలీజ్ అనుకున్నా కూడా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఓటీటీకి ఇచ్చేశారు.
ఇప్పుడు థియేటర్లు సాదారణ స్థితికి వచ్చినా కూడా దృశ్యం 2 ను ఓటీటీ లోనే విడుదల చేసేందుకు సిద్దం అయ్యారని తెలుస్తోంది.అమెజాన్ లో భారీ మొత్తంను దక్కించుకుని స్ట్రీమింగ్ చేసేందుకు సురేష్ బాబు అండ్ టీమ్ రెడీ అయ్యారట.
వెంకటేష్ మరియు మీనాల దృశ్యం 2 లుక్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది.దృశ్యం ను కొనసాగిస్తూ ఈ సినిమా ఉంటుంది.ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ సినిమాను చూడాలని ఆశ పడుతారు.ఖచ్చితంగా మంచి అవకాశం ఉన్న దృశ్యం 2 ను ఓటీటీ ద్వారా విడుదల చేయడం ద్వారా భారీ బాక్సాఫీస్ రెవిన్యూను మిస్ అవుతున్నారు అనే టాక్ వినిపిస్తుంది.
పెద్ద ఎత్తున అంచనాలున్న దృశ్యం 2 లో నదియా మరియు నరేష్ లు కూడా కంటిన్యూ అవుతున్నారు.మొత్తానికి సినిమా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.తాజాగా దృశ్యం 2 టీజర్ ను విడుదల చేయడం జరిగింది.
ఇదే సమయంలో అమెజాన్ లో ఈనెల 25న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా దృశ్యం టీమ్ ప్రకటించింది.ఈ సినిమా ఓటీటీ లో రావడం చాలా మందికి ఇష్టం లేదు.
ఇప్పటికే వెంకటేష్ నారప్ప సినిమా ను ఓటీటీ లో విడుదల చేసి తప్పుచేశారంటూ విమర్శలు వస్తున్నాయి.