విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం 2 అమేజాన్ ప్రైం లో నవంబర్ 25న రిలీజ్ అవుతుంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న వెంకటేష్ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
మళయాళంలో తీసిన దృశ్యం సినిమాను మొదటి పార్ట్ శ్రీ ప్రియ డైరెక్ట్ చేశారు.అయితే దృశ్యం 2ని మాత్రం మాత్రుక దర్శకుడు జీతు జోసెఫ్ డైరెక్ట్ చేయడం విశేషం.
మళయాళ వర్షన్ తర్వాత డైరెక్ట్ గా తెలుగు వర్షన్ ను ఈ డైరక్టర్ డైరెక్ట్ చేశారు.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దృశ్యం 3 కూడా ఉంటుందా అన్న ప్రశ్నకు వెంకటేష్ సరదా సమాధానం ఇచ్చారు.
దృశ్యం 3 కూడా ఉండొచ్చు కాని అప్పటికి తెల్లగడ్డం.పిల్లలు పెద్దవడం లాంటివి ఉంటాయని అన్నారు.అసలైతే జీతు జోసెఫ్ దృశ్యం 2లో కథకు ముగింపు ఇచ్చినట్టు ఉన్నారు.మరి ఆయన మళ్లీ ఈ కథను కొనసాగిస్తారా దృశ్యం 3 తీస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
మొత్తానికి దృశ్యం సీక్వల్ పై ఆడియెన్స్ మాత్రం ఎక్సయిటింగ్ గా ఉన్నారని చెప్పొచ్చు. మళయాళ వర్షన్ లో దృశ్యం 2 సూపర్ హిట్ కాగా తెలుగులో కూడా అదే రేంజ్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.