వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలను ఎక్కువగా తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అయిన హీరో విక్టరీ వెంకటేష్.తన కెరియర్ లో ఎక్కువగా అ వచ్చిన సూపర్ హిట్స్ అన్నీ కూడా ఇలా రీమేక్ ద్వారా వచ్చినవే.
దీంతో టాలీవుడ్ రీమేక్ హీరోగా విక్టరీ వెంకటేష్ కి ఓ మార్క్ ఉంది.ఇక ఎఫ్ 2 సినిమా కి ముందు గురు సినిమాతో మరో రీమేక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న వెంకటేష్ తాజాగా మరో హిందీ సినిమా పై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.
అజయ్ దేవగన్ హీరోగా రకుల్ ప్రీతిసింగ్ టబు హీరోయిన్స్ గా హిందీలో తెరకెక్కి సూపర్ హిట్ అయినా దేదే ప్యార్ మే సినిమాని తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్ నుంచి నిర్మాత సురేష్ బాబు తెలుగు రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది.
అయితే విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీ మామ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత హిందీ రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళి అవకాశముందని సమాచారం.
మరోవైపు రానా నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లోనే యువ హీరో విశ్వక్సేన్ తో కలిసి ఓ మల్టీస్టారర్ లో వెంకటేష్ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.