టాలీవుడ్ లో పండగలకు సినిమాలు విడుదల చేయడం ఆనవాయితీ.అందులో మరీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్ అంటే మన హీరోలందరికీ ఇష్టం.
అప్పుడు సినిమాలు విడుదల చేస్తే కలెక్షన్ల సునామీ రావడం ఖాయం కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిన రికార్డ్ స్థాయి కలెక్షన్లు వస్తాయి.అందుకే సంక్రాంతి పండుగకు ముందు గానే డేట్స్ బ్లాక్ చేసుకుంటారు దర్శక నిర్మాతలు.
ఇక ఇప్పటికే టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ప్రభాస్ రాధే శ్యామ్ తో పాటు టాలీవుడ్ బిగ్గెస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ కూడా సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాయి.
మొన్నటి వరకు మహేష్ సర్కారు వారి పాట సినిమా కూడా సంక్రాంతి రేస్ లో ఉంది .కానీ పోటీ ఎక్కువుగా ఉండడం వల్ల ఈ సినిమాను ఏప్రిల్ 1కి వాయిదా వేశారు.
ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్3 సినిమాను కూడా సంక్రాంతి బరిలోకి దింపుతున్నారని మొదటి నుండి ప్రచారం జరుగుతూనే ఉంది.కానీ మేకర్స్ ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ పై వెంకీ మామ స్పందించాడు.వేంకటేశ్ నటించిన దృశ్యం 2 సినిమా ఓటిటి లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఆయన వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నాడు.
ఈ క్రమంలోనే వెంకీ ఈ సినిమా రిలీజ్ పై స్పందించాడు.ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వడం లేదని ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాడు.ఎఫ్ 3 సినిమా వేసవిలో విడుదల అవుతుందని.ఇప్పటి వరకు 70 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి చేసినట్టు తెలిపాడు.దీంతో ఈ సినిమా సంక్రాంతి రేస్ లో లేదని స్పష్టం అయ్యింది.ఇక ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్, మెహ్రీన్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.
దిల్ రాజు నిర్మిస్తున్నారు.