మలయాళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన అయ్యప్పనుమ్ కొషియుమ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున్న సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఈ సినిమాలో ఎవరు నటిస్తారా అనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
ఇప్పటికే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ నటించనున్నట్లు పలు వార్తలు వచ్చాయి.కాగా ఆయనతో పాటు యంగ్ హీరో రానా కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తోంది.
కానీ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ బాలయ్య ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.దీంతో ఈ సినిమాలో మరో స్టార్ హీరో వెంకటేష్ నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రాబోయే ఈ సినిమాలో వెంకటేష్, రానా దగ్గుబాటి స్క్రీన్ను పంచుకోవడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో వెంకటేష్ అయితే బాగుంటుందని బాలయ్య భావించాడని, అందుకే ఈ సినిమా నుండి ఆయన తప్పుకున్నట్లు ఫిలిం నగర్ టాక్.
మొత్తానికి ఓ స్టార్ హీరో కోసం మరో స్టార్ హీరో ఇలా సినిమా వదులుకోవడం అరుదైన విషయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.కాగా ప్రస్తుతం వెంకటేష్ నారప్ప అనే సినిమాలో నటిస్తుండగా, రానా నటించిన అరణ్య సినిమా రిలీజ్కు రెడీ అయ్యింది.
అటు బాలయ్య ప్రస్తుతం తన కొత్త చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.