మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు.కానీ వీరి కాంబినేషన్ మీద ప్రేక్షకులకి విపరీతమైన ఆసక్తి ఉంది.
దానికి కారణం వెంకటేష్ కెరియర్ లో సూపర్ హిట్ చిత్రాలైన నువ్వు నాకు నచ్చావ్.మల్లీశ్వరి సినిమాలకి మాటలు రచయితగా త్రివిక్రమ్ పని చేశాడు.
ఆ సినిమాలలో వెంకటేష్ నోటి నుంచి వినిపించే ప్రతి మాట త్రివిక్రమ్ ఆణిముత్యాలే కావడం.మంచి టైమింగ్ తో ఆ డైలాగ్స్ చెప్పడంతో అటు వెంకటేష్ కి, ఇటు త్రివిక్రమ్ కి ఆ సినిమాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
తరువాత దర్శకుడుగా బిజీ అయిపోయిన త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తో ఎక్కువగా సినిమాలు చేస్తూ వచ్చాడు.తరువాత త్రివిక్రమ్ ఫ్రేమ్ లోకి ఎన్టీఆర్ వచ్చాడు.
త్రివిక్రమ్ తన కొత్త సినిమా ఎన్టీఆర్తోనే చేస్తున్నారు.ఈ సినిమా డిసెంబర్ లో గాని, వచ్చే ఏడాది ఆరంభంలోగాని సెట్స్ పైకి వెళ్ళిపోతుంది.
ఇదిలా ఉంటే విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కెరియర్ లో 74వ చిత్రంగా నారప్ప చేస్తున్నాడు.దీని తర్వాత 75వ చిత్రంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే అదిరిపోయే కథ కూడా వెంకటేష్ కోసం సిద్ధం చేశాడని ప్రచారం జరుగుతుంది.ఇక ఈ సినిమా త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ అయిన హారికా అండ్ హాసిని నిర్మిస్తుందని కూడా తేల్చేశారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఆ ప్రొడక్షన్ నిర్మాతలలో ఒకరైన సూర్యదేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని, అయితే ఆ విషయంపై మేము క్లారిటీ ఇచ్చే వరకు ఎలాంటి పుకార్లు నమ్మొద్దని స్పష్టం చేశారు.
తాము దానికి సంబందించి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తామని తెలిపారు.మొత్తానికి దీని ద్వారా త్రివిక్రమ్-వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందనే విషయం అయితే కన్ఫర్మ్ అయ్యిందని దగ్గుబాటి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.