మనం సినిమా తర్వాత ఒకే ఫ్యామిలీ హీరోలు కలిసి నటించే సినిమాల పట్ల ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.ఒక ఫామిలీ నుంచి చాలా మంది హీరోలు ఉండటంతో వారు తమ అభిమాన కుటుంబ హీరోలు కలిసి తెరపై కనిపిస్తే చూడాలని అనుకుంటున్నారు.
అక్కినేని ఫ్యామిలీ చిత్రంగా, వారికి ఒక మెమొరబుల్ గిప్ట్ గా మనం సినిమా మిగిలిపోతుంది.అలాగే గతంలో బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి చాలా సినిమాలలో నటించారు.
కళ్యాణ్ రామ్, తారక్ కాంబినేషన్ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అలాగే మెగా ఫ్యామిలీ హీరోలు కలిసి నటిస్తే చూడాలని కోరుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తారనే టాక్ మెగా ఫ్యాన్స్ కి ఆసక్తి పెంచుతుంది.
ఇదిలా ఉంటే రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ మేనల్లుడు నాగ చైతన్య కలిసి వెంకీ మామ సినిమాలో నటించారు.
ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలుగా ఉన్న వెంకటేష్, రానా కాంబినేషన్ లో సినిమా త్వరలోనే ఈ కాంబో పట్టాలెక్కబోతోంది.
ఈ విషయంపై రానా కూడా క్లారిటీ ఇచ్చేశాడు.మా ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రావాలని అందరూ ఎదురు చూస్తున్నారు.
మా నిరీక్షణ కూడా దాని కోసమే.ఇన్నాళ్లు ఎలాంటి కథ కోసం ఎదురు చూశామో… అలాంటి కథ దొరికింది.
అన్ని పనులూ పూర్తయ్యాయి.త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం అని రానా చెప్పేశాడు.2021లోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది.స్క్రిప్టు పనులు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది.
అతి త్వరలో దర్శకుడి పేరుని, ఈ కాంబోని అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.