మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన దృశ్యం ను గతంలో తెలుగు లో వెంకటేష్ రీమేక్ చేసిన విషయం తెల్సిందే.మలయాళం దృశ్యం కంటే కూడా తెలుగు దృశ్యం సూపర్ డూపర్ సక్సెస్ ను దక్కించుకుంది.
ఇటీవలే ఈ సినిమా కు మలయాళంలో సీక్వెల్ వచ్చింది.మోహన్ లాల్ చేసిన దృశ్యం 2 సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ప్రస్తుతం కేరళలో ఎక్కడ చూసినా కూడా దృశ్యం 2 కు సంబంధించిన చర్చ జరుగుతోంది.పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ సినిమా ప్రమోషన్ తో తెలుగు ఆడియన్స్ కూడా దృశ్యం 2 ను తెలుగులో చూడాలని కోరుకుంటున్నారు.
ఇటీవలే తెలుగు దృశ్యం 2 ను వెంకీ మొదలు పెట్టాడు.దృశ్యం 2 ను మలయాళంలో చేసిన జీతూ జోసెఫ్ తెలుగులో దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ ను చిత్రంలో నటిస్తున్న మీనా అధికారికంగా ప్రకటించింది.తెలుగులో గతంలో ఈమె దృశ్యం లో నటించింది.దృశ్యం 2 మలయాళం వర్షన్ లో కూడా ఈమె నటించింది.ఇప్పుడు తెలుగులో కూడా వెంకీ కి జోడీగా ఈమె నటించబోతున్నట్లుగా చెబుతున్నారు.
తాజాగా ఆ విషయమై అధికారికంగా క్లారిటీ వచ్చేసింది.దృశ్యం 2 సినిమా షూటింగ్ లో జాయిన్ అయినట్లుగా పేర్కొంది.
గత రెండు వారాలుగా షూటింగ్ జరుపుతున్నారు.మొత్తంగా ఈ సినిమా కు కేవలం నాలుగు వారాలు మాత్రమే షూటింగ్ చేస్తున్నట్లుగా చెప్పారు.
అంటే నెల రోజుల్లోనే సినిమా పూర్తి కాబోతుంది.మరో రెండు వారాల్లోనే సినిమా కు గుమ్మడి కాయ కొట్టబోతున్నారు.
నేడు మీనా షూటింగ్ లో జాయిన్ అయ్యింది కనుక ఆమె రెండు వారాల పాటు షూటింగ్ లో పాల్గొనబోతుంది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా నారప్ప విడుదల అయిన నెల రోజులకే విడుదల అయ్యే అవకాశం ఉంది.