వెంకటేష్ తో నటించనని ఆ స్టార్ హీరో సినిమా మధ్యలోనే వెళ్ళిపోయాడట.... దాంతో...

తెలుగులో ఒకప్పుడు పలు ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలతో సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ స్వర్గీయ నటుడు “శోభన్ బాబు” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు శోభన్ బాబు అప్పట్లో మద్రాసు నుంచి తెలుగు సినీ పరిశ్రమలో హైదరాబాద్ కి తీసుకు రావడంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు అలాగే అక్కినేని నాగేశ్వరావు, సూపర్ స్టార్ కృష్ణ తదితరులతో కలిసి ఎంతగానో కృషి చేశాడు.

 Venkatesh And Former Actor Sobhan Babu Movie Shooting Stopped News, Sobhan Babu,-TeluguStop.com

కాగా నటుడు శోభన్ బాబు 1959వ సంవత్సరంలో “దైవ బలం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు నటుడిగా పరిచయం అయ్యాడు.ఆ తరువాత దాదాపుగా 30 ఏళ్ళ కాలం పాటు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తిరుగులేని హీరోగా రాణించాడు.

అయితే ఈ 30 ఏళ్ల కాలంలో ఎన్నో హిట్లు, ప్లాపులు ఎదుర్కొన్నప్పటికీ ఒక చిన్న మచ్చ కూడా లేకుండా తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించాడు.

అయితే తాజాగా నటుడు శోభన్ బాబు గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే అప్పట్లో నటుడు శోభన్ బాబు టాలీవుడ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న “బావ మరిది” అనే మల్టీస్టారర్ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాడట.కానీ అనుకోకుండా ఈ చిత్రంలో తన పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో దాదాపుగా ఈ చిత్ర షూటింగ్ సగం పూర్తయినప్పటికీ మధ్యలోనే పలు కారణాలు చెప్పి తప్పుకున్నాడట.

కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వం వహించాడట.

అయితే ఉన్నట్లుండి ఈ చిత్ర నుంచి శోభన్ బాబు తప్పుకోవడంతో ఈ చిత్రంలో నటించడానికి తీసుకున్న పారితోషికం కూడా తిరిగి ఇచ్చేసినట్లు కొందరు చర్చించుకుంటున్నారు.అయితే ఆ తర్వాత శోభన్ బాబు   పాత్రలో సుమన్ నటించడానికి ముందుకు వచ్చినప్పటికీ ఈసారి వెంకటేష్ అనుకోకుండా పలు వ్యక్తిగత కారణాల వల్ల తాను నటించనని చెప్పేశాడట.

దీంతో ప్రేక్షకులు ఓ మంచి మల్టీ స్టారర్ చిత్రాన్ని మిస్ అయ్యారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తెలుగులో “నారప్ప” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “శ్రీకాంత్ అడ్డాల” దర్శకత్వం వహిస్తుండగా “ప్రియమణి” హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించిన “అసురన్” ఈ చిత్రానికి రీమేక్ గా ఉంది.

కాగా హీరో వెంకటేష్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న “ఎఫ్ 3” చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో ప్రిన్స్ వరుణ్ తేజ్ మెహరీన్, తమన్నా భాటియా, సునీల్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కొద ప్రారంభమైనట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube