ఒకప్పుడు టాలీవుడ్ లో వల్లభ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టువంటి శింబు అంటే ఇప్పటికీ అందరికీ బాగానే గుర్తు ఉంటుంది.అయితే ఆ తర్వాత వచ్చినటువంటి మన్మధ, కుర్రాడొచ్చాడు, ధీరుడు, పోకిరోడు, వంటి చిత్రాలతో బాగానే ఆకట్టుకున్నాడు.
అయితే శింబు ఒక నటుడిగానే కాకుండా గాయకుడిగా రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.అయితే తాజాగా శింబు నటించినటువంటి నవాబ్ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
దాంతో ప్రస్తుతం శింబు కెరీర్ ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది.
అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న టువంటి మానాడు అనే చిత్రంలో శింబు నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో శింబు ఓ ముస్లిం యువకుడు పాత్రలో నటిస్తున్నాడు.దీంతో ఈ పాత్రకి పేరు పెట్టాలంటూ దర్శకుడు వెంకట్ ప్రభు సినీ అభిమానులను కోరుతున్నాడు.ఇందుకుగాను సోషల్ మీడియా సామాజిక మాధ్యమం అయినటువంటి అధికారిక ఖాతా ద్వారా తన చిత్రంలో శింబు నటిస్తున్న టువంటి పాత్రకి పేరు పెట్టాలంటూ అలాగే ఆ పేరుని #str_as అనే హష్ ట్యాగ్ తో షేర్ చేయాలని సూచించారు.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు మాత్రం దర్శకుడు తెలుపలేదు.అంతేగాక మరికొద్ది రోజుల్లో అధికారికంగా తెలియజేస్తామని దర్శకుడు పేర్కొన్నాడు.అయితే ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు