పాక్‌కు వెంకయ్య నాయుడి తీవ్ర హెచ్చరిక

పాకిస్తాన్‌ ఎంత రెచ్చగొట్టినా కూడా భారత్‌ మాత్రం సహనాన్ని కోల్పోదని, కాని దాడి చేస్తే మాత్రం సహనంతో చూస్తూ ఉండకుండా దాడి చేస్తుందని, ఆ దాడి ఎంత దారుణంగా ఉంటుందంటే పాకిస్తాన్‌ ఎప్పటికి దాన్ని మర్చిపోలేదు అంటూ తీవ్ర స్వరంతో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వారు ఎవరు కూడా ఈ స్థాయిలో దాయాదీ దేశంపై కామెంట్స్‌ చేయలేదు.

 Venkaiah Naiduwarning Onpakistan Ramnath-TeluguStop.com

మొదటి సారి వెంకయ్య నాయుడు పాకిస్తాన్‌ను హెర్చరిస్తు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఇది పాకిస్తాన్‌కు పెద్ద హెచ్చరిక అంటూ అంతర్జాతీయ సమాజం అంటోంది.

రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ రెండేళ్ల పదవి కాలంలో 95 ప్రసంగాలను చేయడం జరిగింది.ఆ ప్రసంగాలను రెండు బుక్కులుగా తయారు చేశారు.ఆ బుక్స్‌ను ఆవిష్కరించిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.గత చరిత్రను చూస్తే ఎప్పుడు కూడా భారత దేశం చాలా శాంతిగా ఉంది.

ఇతర దేశాలు తమ సార్వభౌమాధికారంను కాలరాసేందుకు ప్రయత్నించిన సమయంలో ఆ దేశాలకు తప్పకుండా బుద్ది చెప్తాం అంటూ వెంకయ్య నాయుడు హెచ్చరించారు.పాకిస్తాన్‌ ఈ విషయాలను  గుర్తించి మసలుకోవాలంటూ ఆయన హెచ్చరికలు చేశారు.

వెంకయ్య నాయుడు పాకిస్తాన్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube