రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తాం అంటూ చెప్పిన కేంద్రం.రాష్ట్రం విడిపోయి 6నెలలు గడుస్తున్నా దానిపై అసలు మాట్లాడటమే లేదు.
అయితే ఈ ప్రత్యేక హోదా గురించి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన చెప్పిన తీరు బట్టి చూస్తే ఆంధ్ర కు ప్రత్యేక హోదా తుస్ అనే చెప్పాలి.
ఎందుకంటే ప్రత్యేక హోదా కావాలంటే దానికి మిగిలిన అన్ని రాష్ట్రాలు అంగీకరించాలి.ఒప్పుకుని ఓటు వెయ్యాలి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో తమిళ నాడు, తెలంగాణా ఆంధ్ర కు వ్యతిరేకంగానే ఉన్నాయి కనుక అది కుదరదు.అంతేకాకుండా తెగించి సభలో బిల్ పెట్టినా అది పాస్ కావడం కష్టమే.
కానీ, వీటన్నింటినీ అధిగమించి ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా తెస్తాం అంటున్నారు వెంకయ్య.ఇదంతా జరిగేది కాదు అని ఆయనకు సైతం తెలుసు.
మరి ఏం జరుగుతుందో చూడాలి.