ప్రతి మనిషి జీవితంలో డబ్బు కోసం పరుగు పెడుతూ ఉంటాడు.ఎందుకంటే ఏ అవసరం వచ్చిన డబ్బు లేనిదే ఆ అవసరం తీరదు.
ఇల్లు గడవాలన్న డబ్బు ఉండవలసిందే కదా.ఒక్కోసారి సడన్ గా కొన్ని ఖర్చులు వాస్తు ఉంటాయి.
అప్పుడు సమయానికి చేతిలో డబ్బు ఉండకపోవచ్చు.డబ్బు చేతిలోకి వచ్చినట్టే వచ్చి ఆలా చేజారుతూ ఉంటుంది.
ఆలా డబ్బు చేజారకుండా చేతిలో ఉండాలంటే కొన్ని పరిష్కారాలు చేయాలి.వీటిని చేస్తే డబ్బు నిలవటమే కాకుండా మనస్సు ప్రశాంతంగా కూడా ఉంటుంది.
ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం
కర్పూరాన్ని ఆవు నేతిలో ముంచి వెలిగించి ఆ దూపాన్ని ఇల్లంతా చూపించాలి.ఈ విధంగా చేయటం వలన ఇల్లంతా సుఖ సంతోషాలతో కళకళలాడుతూ ఉంటుంది
సాయంత్రం సమయంలో వెండి గిన్నెలో కర్పూరం వేసి వెలిగించి దానిలో లవంగాలు వేసి ధూపం వేస్తె మంచి జరుగుతుంది.ఈ విధంగా ప్రతి రోజు సాయంత్రం క్రమం తప్పకుండా చేయాలి
12 సగ్గుబియ్యం గింజలను తీసుకోని మండే కర్పూరంలో వేస్తె సౌభాగ్యం కలుగుతుంది
శనివారం స్నానము చేసే నీటిలో కర్పూరం వేస్తె స్నానం చేస్తే మంచి జరుగుతుంది
ప్రతి రోజు రాత్రి సమయంలో కర్పూరం వెలిగించి హనుమను చాలీసా చదివితే చెడు సంఘటనల నుండి బయట పడవచ్చు
ఇంటిలో ఎదో ఒక మూల గిన్నెలో కర్పూరం వేసి ఉంచితే వాస్తు దోషాలు పోతాయి.కర్పూరం బిళ్ళలు కరిగిపోగానే మరల కొత్త కర్పూరం బిళ్ళలు వేయాలి.