జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.పవన్ ఒక రాజకీయ అజ్ఞాని తరహాలో మాట్లాడుతున్నాడు.
గతంలో కర్నూలు రాజధాని కావాలంటూ మాట్లాడిన పవన్ ఇప్పుడు కర్నూలుకు హైకోర్టు వస్తే ఉద్యోగాలు వస్తాయా అంటూ మాట్లాడుతున్నాడు.ఆయన తీరు ఏమాత్రం సరిగా లేదంటూ ఈ సందర్బంగా మంత్రి అన్నాడు.
రాజధాని విషయమై మరియు ఇతర విషయాలపై ఆయనకు ఏమాత్రం అవగాహణ లేని కారణంగానే ఇలాంటి అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నాడు.
ఇక చంద్రబాబుతో లాలూచి పడి చంద్రబాబును కాపాడేందుకు బాబు మేలు కోసం పవన్ బీజేపీతో దోస్తీ కట్టాడని, బీజేపీతో దోస్తీ కేవలం చంద్రబాబును కాపాడేందుకు అంటూ మంత్రి ఎద్దేవ చేశాడు.
ఆ మూడు పార్టీలు కూడా తోడు దొంగలు అంటూ మంత్రి కామెంట్స్ చేశాడు.ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు తీరుపై కూడా మంత్రి విమర్శలు గుప్పించారు.సీనియర్ను అంటూ చెప్పుకునే బాబు ఆస్తులు కాపాడుకునేందుకు రాష్ట్ర అభివృద్దిని అడ్డుకుంటున్నాడు అన్నాడు.