ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం రాంపురం వద్ద బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.చంద్రుగొండ మండలం బాలికుంట గ్రామస్తులు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాలో జరుగుతున్న ఓ శుభకార్యానికి బోలెరో వాహనంలో బయలుదేరారు.ఈ క్రమంలో బోలెరో రాంపురం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టాటాఎస్ వాహనాన్ని తప్పించబోయి రోడ్డు వంపులోకి దూసుకెళ్లి బోల్తాపడింది.
ఈ ఘటనలో లక్ష్మీ (40) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదస్థలిని పరిశీలించారు.