ఫరీదాబాద్( Faridabad )కు చెందిన మాజీ కూరగాయల వ్యాపారి రిషబ్ శర్మ పెద్ద స్కామ్ చేశాడు.ఫేక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇప్పిస్తానని భారతదేశం అంతటా చాలామంది ప్రజలను ఇతడు మోసం చేశాడు.
ఈ కేటుగాడి భారీ ఆన్లైన్ స్కామ్ బయటపడటంతో పోలీసులు తాజాగా అతడిని అరెస్ట్ చేశారు.వందలాది మంది బాధితులను మోసం చేసి కేవలం ఆరు నెలల్లో రూ.21 కోట్లు సంపాదించాడని పోలీసులు తెలుసుకొని కంగుతిన్నారు.
రిషబ్ శర్మ, 27, మహమ్మారి సమయంలో భారీ నష్టాలను చవిచూసే వరకు ఫరీదాబాద్లో పండ్లు, కూరగాయలు విక్రయించేవాడు.ఆ తర్వాత అప్పటికే ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న తన స్నేహితుడితో కలిసి వ్యాపారంలో మెలకువలు నేర్చుకున్నాడు.అతను “మారియట్ బోన్వాయ్”( Marriot Bonvoy ) అనే పేరుతో ఒక హోటల్ చైయిన్కి సంబంధించిన ఒక ఫేక్ వెబ్సైట్ను క్రియేట్ చేశాడు.
చాలా ఫోన్ నంబర్లను చీకట్లో బాణంలా టైప్ చేసి ఆ నంబర్లకు వాట్సాప్ మెసేజ్లు పంపాడు, హోటల్లకు రివ్యూలు రాయడానికి పార్ట్టైమ్ ఉద్యోగాలు ఇస్తామని హామీ చేశాడు.అతని బాధితుల్లో ఒకరు డెహ్రాడూన్కు చెందిన ఒక వ్యాపారవేత్త, అతను ఈ మోసగాడి వలలో పడిపోయాడు.
మారియట్ బోన్వాయ్ ప్రతినిధిగా నటించిన రిషబ్ శర్మకు ఫోన్ కాల్ చేశాడు.ఆ వ్యాపారిని నమ్మించేందుకు రిషబ్ సోనియాను కూడా పరిచయం చేసాడు, ఆమె ఒక హోటల్లో అసోసియేట్ అని చెప్పుకుంది.
వీరిద్దరూ వ్యాపారవేత్తను రివ్యూలు రాయమని అడిగారు.అతని ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాలో రెండుసార్లు రూ.10,000 చెల్లించారు.అయితే, అధిక రాబడిని పొందడానికి ఎక్కువ డబ్బును పెట్టుబడి పెట్టాలని కూడా అడిగారు.
ఎక్కువ పెట్టుబడి పెడితే కోటి వరకు రాబట్టవచ్చని చెప్పారు.
వ్యాపారవేత్త రిషబ్ శర్మ( Rishabh Sharma ), సోనియాలను నమ్మి మొత్తం రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టాడు.అయితే, వారు తన కాల్లు, మెసేజ్లకు సమాధానం ఇవ్వడం మానేసి, వారి నంబర్లను స్విచ్ ఆఫ్ చేయడంతో తాను మోసపోయానని వెంటనే గ్రహించాడు.
ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు, వారు రిషబ్ శర్మను కనుగొని అక్టోబర్ 28న అరెస్టు చేశారు.భారతదేశంలోని 10 రాష్ట్రాల్లో నమోదైన 37 మోసాలకు సంబంధించిన కేసుల్లో రిషబ్ శర్మ ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అతను 855 ఇతర కేసులలో కూడా పాత్ర పోషించాడు.తన కుంభకోణంలో రూ.21 కోట్లు రాబట్టాడు.కానీ చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ముందుగానే డబ్బులు కట్టమని అడిగే వారిని ఎప్పటికీ నమ్మకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.